Headlines

విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపే వేదిక: విజయవాడ, విశాఖలోనూ టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 | TV9 & KAB Education Expo 2026 will be held in Vijayawada and Visakhapatnam on May 30 and 31

విజయవాడ, మే 26: హైదరాబాద్ లో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అదే ఉత్సాహంతో TV9 & KAB Education Expo 2026 విజయవాడలో మే 30 & 31 తేదీల్లో SS Convention Centre, లబ్బీపేటలో, విశాఖపట్నంలో మే 31, 2026న Novotel Visakhapatnam, డాక్టర్ NTR బీచ్ రోడ్‌లో నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత విద్యా అవకాశాలు, సరైన కోర్సుల ఎంపిక,…

Read More

Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్.. | Ebola alert in andhra pradesh screening tightened at airports amid africa outbreak video tv9d

ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే 200 మందికిపైగా ఎబోలా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్‌ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలను గుర్తిస్తే వెంటనే క్వారంటైన్ తరలించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్టయింది. ఆఫ్రికాలోని మూడు దేశాలలో…

Read More

కడప పోలీసులా మజాకా..! ఇక గంజాయి బాబుల ఆటలు సాగవు..! | Kadapa Police Conduct Rapid Tests to Identify Ganja Users

వాహనాల తనిఖీ అంటే కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మాత్రమే అనుకుంటే ఇకపై పొరపాటే. మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి సేవించి రోడ్లపైకి వస్తే స్పాట్లోనే తాట తీసేందుకు కడప పోలీసులు సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించారు. సరికొత్త ‘రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ల’తో రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కడప నగరంలో గంజాయి విచ్చలవిడిగా హల్‌చల్ చేస్తుండటం, ముఖ్యంగా యువత ఈ మత్తుకు బానిసలవుతుండటంతో…

Read More

Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా… | Thieves Dig Hole Through Wall, Rob Jewellery Showroom in Vinukonda

మూడేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండ దక్షిణ బజార్‌లో రాహుల్ రెడ్డి, వెంకట శివరెడ్డి కలిసి బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నెలల క్రితం వ్యాపారాన్ని విస్తరించి “వేక్షిత జ్యూయలర్స్” పేరుతో ఆధునిక షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం రాత్రి షాపును మూసివేసి యజమానులు ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం షాపుకు వచ్చి చూడగా, షట్టర్ యథావిధిగా మూసి ఉన్నప్పటికీ లోపల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు…

Read More

భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే

తిరుపతి నగరంలో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై బాబాయ్ అఘాయిత్యం సంచలనంగా మారింది. ఈ మేరకు ఈస్ట్ పీఎస్ లో నమోదైన పోక్సో కేసు సంచలన విషయాలను బయటపెట్టింది. వరుసకు కూతురైన బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి, అందుకు సహకరించిన భార్య ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన రామ్మూర్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే రామ్మూర్తి GST కార్యాలయంలో…

Read More

కలకాలం తోడూనీడగా ఉంటాడని ప్రేమ వివాహం చేసుకుంది.. కానీ అతను చేసిన మోసం తట్టుకోలేక..! | Young Woman Commits Suicide, Alleging Love Marriage Cheated in Nandyal District

కుటుంబాన్ని ఎదిరించి, నాయకుడిని నమ్మి పెళ్లి చేసుకున్న ఓ వివాహిత చివరికి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయి, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె మోహిత. ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన స్థానిక రాజకీయ నాయకుడు…

Read More

Andhra Weather: హమ్మయ్య.. మండే ఎండల్లో చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ | Monsoon Advances Further; Rains, Thunderstorms and Strong Winds Likely in Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్…

Read More

Weather Report: ముంచుకొస్తున్న నైరుతి.. ఏపీ, తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో.. | Rain Alert Issued for Andhra Pradesh and Telangana for Next Three Days

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక గురువారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఒడిస్సా కోస్తా…

Read More

Monitor Lizards: ఉడుము గుడ్లు మీరెప్పుడైనా చూశారా..?.. ఒక్కసారి ఎన్ని ఎగ్స్ పెడుతుందంటే..? | Interesting Facts About Monitor Lizards Their Eggs and Wildlife Protection Laws

తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల దగ్గర, పొలాల గెట్ల వద్ద, రాళ్ల మధ్య లేదా చెట్ల పొదల్లో అప్పుడప్పుడు కనిపించే జీవుల్లో ఉడుము కూడా ఒకటి. చాలామంది దీనిని చూసి భయపడతారు. కానీ ఉడుము ప్రకృతిలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే సరీసృపం. ముఖ్యంగా దాని జీవన విధానం, గుడ్లు పెట్టే తీరు, పిల్లలను కాపాడే పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఉడుమును సాధారణంగా “బెంగాల్ మానిటర్ లిజర్డ్” అని పిలుస్తారు. ఇది వేగంగా…

Read More

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌ | Telugu Woman Trapped in Kuwait Pleads for Help in Viral Selfie Video tv9d

ఇటీవల కాలంలో బ్రతుకుతెరువుకోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఆర్ధిక సమస్యలనుంచి గట్టెక్కవచ్చని, కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చని గంపెడాశతో అయినవారిని వదిలి పొట్ట చేతపట్టుకొని అప్పులు చేసుకొని మరీ విదేశాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ వారికి ఎదురయ్యే పరిస్థితులు వేరు. పనిచేసే ప్రదేశంలో యజమానుల చేత తీవ్ర వేధింపులకు గురవుతూ…క్షణక్షణం నరకం అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారి వేధింపులు తాళలేక తమ గోడును ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ కాపాడమని వేడుకుంటున్నారు….

Read More