Srisailam AP Darshan నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి. వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ ( స్పర్శ) దర్శనాలను నిలిపివేశారు ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు

నంద్యాల జిల్లా శ్రీశైలం (Sivadam) మహాక్షేత్రంలో వేసవి సెలవులు. వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దర్శనాలు విషయంలో మార్పులు చేశారు ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలు నిలుపుదల చేశారు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు ముందస్తుగా ఆన్లైన్లో లో స్పర్శ దర్శనం టికెట్స్ పొందిన భక్తులకు యధావిధిగా స్పర్శ దర్శనం కొనసాగిస్తామని, శ్రీస్వామి అమ్మవారి భక్తులందరూ గమనించి దేవస్థానానికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు భక్తులను కోరారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకార సహకరించవలసిందిగా కోరారు.
