పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని జేసీ ఆందోళన.. తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులతో పాటు వైకాపాకు చెందిన 24 మంది కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు….
