Headlines

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం | Telangana Maize Floods AP Warehouses; Truck Drivers Stranded for 14 Days

తెలంగాణలో ఈసారి మొక్కజొన్న పంట బాగా పండింది. రైతులు ఆశించిన దిగుబడులు రావడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, గోడౌన్స్ అన్నీ మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయి. అయితే పంట ఎక్కువగా రావడం ఇప్పుడు రైతులకే కాదు.. లారీ డ్రైవర్లకు కూడా పెద్ద కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రుపాలెం, కొణిజర్ల, చింతకాని, నాగలవంచ, మధిర ప్రాంతాల సొసైటీల నుంచి భారీగా మొక్కజొన్నను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేర్‌హౌస్ గోడౌన్స్ ప్రస్తుతం పూర్తిగా…

Read More

British Scholarships 2026: బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల పూర్తి గైడ్ ఇక్కడే! | British Scholarships 2026: Complete Guide for Indian Students to Study in the UK for Free

బ్రిటిష్ ప్రభుత్వం, యూకేలోని వివిధ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ప్రతి సంవత్సరం బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. వీటిలో ట్యూషన్ ఫీజులతో పాటు జీవన ఖర్చులు కూడా భరించబడే అవకాశముంది. ప్రధాన స్కాలర్‌షిప్‌లు చెవెనింగ్ స్కాలర్‌షిప్ (Chevening Scholarship): ఇది బ్రిటిష్ ప్రభుత్వపు అత్యంత ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లలో ఒకటి. నాయకత్వ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ఏ విభాగంలోనైనా ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి పూర్తిగా ఆర్థిక సహాయం అందిస్తుంది. కామన్వెల్త్…

Read More

Weather: అబ్బ.. చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్.. | Latest Weather Update: Rain Alert in Andhra Pradesh and Telangana as Bay of Bengal Low Pressure Continues

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. బుధవారం వరకు ఎండలు దంచికొట్టగా.. గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్నటి…

Read More

Andhra Pradesh: ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. నో వెహికల్ డే.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. | AP Chandrababu Govt Announces ‘No Vehicle Day’ and Work From Home Measures to Promote Fuel Savings

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో పొదుపు బాట పట్టింది ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మనదేశం-మన బాధ్యత పేరుతో పలు నిర్ణయాలను ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా వనరుల ఆదాపైనే చర్చ జరిగింది. కాన్వాయ్‌ల తగ్గింపుతో సరిపోదన్న ముఖ్యమంత్రి మరిన్ని పొదుపు చర్యలను సూచించారు. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటిద్దామని, కొన్ని రోజులు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎమ్మెల్యేలు,…

Read More

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు | AP and TS Weather Update: Heatwaves, Rains, Monsoon Forecast Protect Yourself from Heatstroke video tv9d

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఎండల తీవ్ర నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు ,రాయలసీమ ప్రాంతంలో వర్షాల…

Read More

AP PGECET 2026 Result: ఏపీ పీజీఈసీఈటీ-2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..! | AP PGECET 2026 results out, check how to download rank card, merit list, released by Minister Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసీఈటీ (AP PGECET)-2026 పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు గురువారం (మే 14) సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ఈ ఏడాది ఏపీ పీజీఈసీఈటీ పరీక్షకు మొత్తం 9,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 9,320 మంది…

Read More

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్‌లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు.. | AP Government Sanctions 895 New Pensions under NTR Bharosa scheme for Chronic Disease Patients

ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పేదలు వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు….

Read More

బిగ్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో SIR.. ఎప్పటినుంచో తెలుసా..? | Election Commission Announces SIR Phase 3 in Andhra Pradesh, Telangana among 16 States 3 UTs, Here’s the Full Schedule

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫేజ్-3ను ప్రకటించింది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దశలవారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపనుంది. ఏపీ,తెలంగాణ సహా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ దశలవారీగా జరగనుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను తదుపరి ఫేజ్ లో SIR ప్రక్రియ జరగనుంది. జనగణన, గృహ జాబితా ప్రక్రియలతో కలిపి ఈ SIR ఫేజ్-3ను నిర్వహించనున్నట్లు…

Read More

మున్సిపల్ టాక్స్ కట్టలేదని.. చెత్తతో భలే ట్రీట్మెంట్ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది! | Municipal Staff dumped garbage in front of function hall to collect unpaid tax dues in Punganur, Annamayya District

పన్నుల వసూలు కోసం మున్సిపల్ అధికారులు వినూత్న, దూకుడు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో పన్నులు చెల్లించని ఒక ఫంక్షన్ హాల్ యజమానికి మున్సిపల్ సిబ్బంది గట్టి షాక్ ఇచ్చారు. బల్క్ వేస్టేజ్ (భారీ వ్యర్థాల) తొలగింపు పన్నులను దీర్ఘకాలంగా చెల్లించకుండా మొండికేస్తున్న విబిఎస్ ఫంక్షన్ హాల్ ప్రధాన గేటు ముందే మున్సిపల్ సిబ్బంది ఏకంగా చెత్తను తెచ్చి డంప్ చేశారు. నిబంధనల ప్రకారం ఫంక్షన్ హాల్‌లో ఏదైనా శుభకార్యం జరిగితే, వ్యర్థాల…

Read More

నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకుని అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు, అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం (మే 13) రాత్రి 1:58 గంటలకు వైభవంగా వివాహమైంది. వరుడి…

Read More