Headlines
Jansena kovur

కోవూరులో జనసేన ‘చాయ్ విత్ జనసైనిక్’: యువతతో మమేకమైన పార్టీ నేతలు

కోవూరు, 27 జూన్ 2026: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోవూరులో ‘చాయ్ విత్ జనసైనిక్’ పేరుతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక యువతతో కలిసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గదిరాజు జీవన్ కృష్ణ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలపై పోరాడే విధానాలను యువతకు వివరించారు. యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక…

Read More

కోవూరు క్లస్టర్-5, లేగుంటపాడులో ఘనంగా జరిగిన మహానాడు వర్చువల్ సభ: కార్యకర్తల్లో నూతన ఉత్సాహం

ప్రజా సమస్యలే అజెండాగా.. క్షేత్రస్థాయిలో బలోపేతమవుతున్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు స్ఫూర్తితో, కోవూరు నియోజకవర్గం, క్లస్టర్-5 పరిధిలోని లేగుంటపాడులో వర్చువల్ మహానాడు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, పార్టీ సిద్ధాంతాలను, భవిష్యత్తు కార్యాచరణను చర్చించారు. అధినేత పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ సభ, స్థానిక రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు…

Read More

ఎడారిలా మారిన కొల్లేరు.. ఆకలితో అలమటిస్తున్న విదేశీ పక్షులు

ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన ఈ చిత్తడి నేలలు, ఇప్పుడు పక్షుల మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, పక్షులకు ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా, ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ఏటికేటికీ పడిపోతోందనే వాడన్ సైతం బలంగా వినిపిస్తుంది . మండవల్లి మండల పరిధిలోని పెద్దయడగాడి వంటి ప్రధాన ప్రాంతాల…

Read More

మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త.. మెడకు చున్నీ బిగించి హత్య చేసిన భార్య! | A wife killed her husband while he was under influence of alcohol in Visakhapatnam

తగరపువలస, మే 26: మందు కొట్టి ఇంటికొచ్చిన భర్తతో గొడవ పడిందో ఇల్లాలు. ఆవేశంలో మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆనక ఏమీ తెలియనట్లు ఇరుగు పొరుగును పలిచి ఏదో తాగేసి భర్త స్పృహతప్పి పడిపోయాడని లబోదిబోమంది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పతి దేవుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్తింటి వారు ఆరా తీయగా అసలు నిజం బయట పడింది. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేసి…

Read More

ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహానంది సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చిన ఒక ఆడ పెద్దపులి, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణుల రక్షణకు కేంద్రంగా ఉన్న నల్లమల అడవుల్లో ఈ ఘటన జరగడం పర్యావరణ ప్రేమికులను, అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గాజులపల్లి రైల్వే స్టేషన్ నుండి చలమ రైల్వే స్టేషన్ మధ్య…

Read More

విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపే వేదిక: విజయవాడ, విశాఖలోనూ టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 | TV9 & KAB Education Expo 2026 will be held in Vijayawada and Visakhapatnam on May 30 and 31

విజయవాడ, మే 26: హైదరాబాద్ లో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అదే ఉత్సాహంతో TV9 & KAB Education Expo 2026 విజయవాడలో మే 30 & 31 తేదీల్లో SS Convention Centre, లబ్బీపేటలో, విశాఖపట్నంలో మే 31, 2026న Novotel Visakhapatnam, డాక్టర్ NTR బీచ్ రోడ్‌లో నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత విద్యా అవకాశాలు, సరైన కోర్సుల ఎంపిక,…

Read More

Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్.. | Ebola alert in andhra pradesh screening tightened at airports amid africa outbreak video tv9d

ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే 200 మందికిపైగా ఎబోలా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్‌ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలను గుర్తిస్తే వెంటనే క్వారంటైన్ తరలించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్టయింది. ఆఫ్రికాలోని మూడు దేశాలలో…

Read More

కడప పోలీసులా మజాకా..! ఇక గంజాయి బాబుల ఆటలు సాగవు..! | Kadapa Police Conduct Rapid Tests to Identify Ganja Users

వాహనాల తనిఖీ అంటే కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మాత్రమే అనుకుంటే ఇకపై పొరపాటే. మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి సేవించి రోడ్లపైకి వస్తే స్పాట్లోనే తాట తీసేందుకు కడప పోలీసులు సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించారు. సరికొత్త ‘రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ల’తో రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కడప నగరంలో గంజాయి విచ్చలవిడిగా హల్‌చల్ చేస్తుండటం, ముఖ్యంగా యువత ఈ మత్తుకు బానిసలవుతుండటంతో…

Read More

Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా… | Thieves Dig Hole Through Wall, Rob Jewellery Showroom in Vinukonda

మూడేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండ దక్షిణ బజార్‌లో రాహుల్ రెడ్డి, వెంకట శివరెడ్డి కలిసి బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నెలల క్రితం వ్యాపారాన్ని విస్తరించి “వేక్షిత జ్యూయలర్స్” పేరుతో ఆధునిక షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం రాత్రి షాపును మూసివేసి యజమానులు ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం షాపుకు వచ్చి చూడగా, షట్టర్ యథావిధిగా మూసి ఉన్నప్పటికీ లోపల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు…

Read More

భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే

తిరుపతి నగరంలో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై బాబాయ్ అఘాయిత్యం సంచలనంగా మారింది. ఈ మేరకు ఈస్ట్ పీఎస్ లో నమోదైన పోక్సో కేసు సంచలన విషయాలను బయటపెట్టింది. వరుసకు కూతురైన బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి, అందుకు సహకరించిన భార్య ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన రామ్మూర్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే రామ్మూర్తి GST కార్యాలయంలో…

Read More