రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Monsoon and Weather Update: Rain Alert Along With Heatwave in Telugu States
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య…
