ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!
నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహానంది సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చిన ఒక ఆడ పెద్దపులి, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణుల రక్షణకు కేంద్రంగా ఉన్న నల్లమల అడవుల్లో ఈ ఘటన జరగడం పర్యావరణ ప్రేమికులను, అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గాజులపల్లి రైల్వే స్టేషన్ నుండి చలమ రైల్వే స్టేషన్ మధ్య…
