Headlines

గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్..! పూర్తి వివరాలు ఇవే | Daily Train Service from Hyderabad to Goa: Complete Travel Details You Should Know

హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. రైల్వే సదుపాయాలు పెరుగుతుండటంతో ఇకపై గోవా చేరుకోవడం గతంతో పోలిస్తే చాలా సౌకర్యవంతంగా మారనుంది. ప్రస్తుతం కొన్ని వారాంతపు రైళ్లే ఉన్నప్పటికీ, కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడంతో వారంలో దాదాపు ప్రతి రోజూ గోవాకు వెళ్లే అవకాశం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే కాచిగూడ–యలహంక (17603) రైలు ప్రధానంగా ఉపయోగించేవారు. అయితే ఈ రైలు ప్రయాణంలో గుంతకల్ వద్ద బోగీలు మార్చాల్సి వచ్చేది, దాంతో దాదాపు…

Read More

అదే పనిగా అరుస్తున్న కోళ్లు.. ఏంటా అని చూడగా.. వామ్మో 5 అడుగులు.. గుండె ఆగేంతపనైంది.. | 5 Foot King Cobra Snake Found Inside Poultry Farm, Villagers Panic in Markapuram Watch Video

కోడి గుడ్లను తినమరిగిన ఓ నాగుపాము ఓ కోళ్ళఫారంలో తిష్టవేసింది. ఆకలేసినప్పుడల్లా గుడ్లను మింగేస్తోంది. ఈ విషయం తెలియని కోళ్ళ ఫారం యజమాని ఎప్పటిలాగే కోళ్ళఫారంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నాడు. ఈరోజు కోళ్ళకు దాణా వేసే సమయంలో.. కోళ్ళు పెద్ద పెద్దగా అరుస్తుండటంతో అనుమానం వచ్చిన యజమాని ఫారంలోని ప్రతి ప్రాంతాన్ని గాలించాడు. దీంతో ఓ మూలననక్కి బుసలు కొడుతున్న 5 అడుగుల నాగుపాము కనిపించింది. నాగుపాములను చూడగానే హడలిపోయిన కోళ్ళఫారం యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం…

Read More

ఫిజిక్స్‌ టఫ్‌, కెమిస్ట్రీ సులభం.. చుక్కలు చూపించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌! ఈసారి కటాఫ్‌ మార్కులు ఎంతంటే? | JEE Advanced 2026 Result to be declared on June 1, Expected cut off marks here

హైదరాబాద్‌, మే 18: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం (మే 17) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలో పేపర్ 1, 2 ప్రశ్నాపత్రాలు కాస్త కఠినంగానే వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిజిక్స్‌ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. మ్యాథమెటిక్స్ మాత్రం మద్యస్థంగా వచ్చింది. కెమిస్ట్రీ కాస్త సులువుగా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. ఉదయం నిర్వహించిన పేపర్‌ 1తోపాటు మధ్యాహ్నం…

Read More

హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త సర్వీస్ | Hyderabad to Tirupati New Weekly Express Train: Charlapalli Tiruchanur Service for Srivari Devotees

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్‌లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ కొత్త వీక్‌లీ టైన్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More

AP News: ఇంటర్‌లో 60 మార్కులొస్తే 5 వేసి ఫెయిల్‌ చేసిన లెక్చరర్‌కి స్వల్ప శిక్షా..? కఠిన చర్యలేవి.. | AP Inter student failed with 5 out of 60 marks Controversy: Demand for strict punishment for the teacher who conducted evaluation

అమరావతి, మే 18: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియల్ ఫలితాల్లో పలు దారుణాలు వెలుగు చూశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు లెక్చరర్లు మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు చేసి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంగా పేపర్లు మూల్యాంకనం చేసిన లెక్చరర్లపై మాత్రం కఠిన చర్యలు ఉండటం లేదు. మూల్యాంకనం ముందు విద్యాశాఖ హడావిడి చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తూతూ మంత్రంగా ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనంలో పొరబాట్లు చేస్తే లెక్చరర్లకు భారీ…

Read More

ఎంత కట్టుదిట్టం చేసినా ఈ ఆవు చూడండి ఏం చేస్తుందో.. | Dairy Cow Self Suckling: Farmers Challenges Effective Solutions

పశువుల పెంపకంలో రైతులకు ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఆవులు తమ పొదుగు పాలను తామే తాగేయడం (Self-Suckling) ఒకటి. ఈ అలవాటు వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా, పొదుగులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చాలామంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూ పలు పద్ధతులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఆవులు మెడను బాగా వెనక్కి వంచి తమ పొదుగును చేరుకుని పాలు తాగేస్తాయి. దీనిని అడ్డుకునేందుకు రైతులు మెడ చుట్టూ కట్టెలు కట్టడం, ముట్టికి…

Read More

Admissions: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఒకే పోర్టల్ ద్వారా అన్ని కాలేజీల ప్రవేశాలు | One single window portal for all undergraduate degree admissions in Andhra Pradesh for 2026 27 session

అమరావతి, మే 18: 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దీనిని తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం ఒకే ఆన్‌లైన్ వేదిక కింద దీనిని ప్రవేశపెట్టనుంది. డిగ్రీలో ప్రవేశాలకు వేర్వేరు దరఖాస్తులు దాఖలు చేయడానికి బదులుగా విద్యార్థులు ఒకేసారి నమోదు చేసుకుని, కోర్సులను ఎంపిక చేసుకుని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఆధార్ అనుసంధానం వల్ల ఎలాంటి ఫిజికల్‌ సర్టిఫికెట్ల అవసరం లేకుండా…

Read More

Heatwave: ఇకపైనే అసలు ఎండకాలం.. తెలుగురాష్ట్రాలకు భారీ హెచ్చరికలు.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్! | IMD Heatwave Alert: Telangana and Andhra Pradesh to Witness Record High Temperatures

ఈ ఏడాది వేసవి కాలం మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. సాయంత్రం అవ్వగానే వాతావరణం చల్లబడి వర్షాలు కురిసేవి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం సీన్ మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని, అలాగే వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలిపింది. రాబోయే…

Read More

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల | AP Forest Department Recruitment 2026 Notification released to fill 40 posts in under sports quota

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మే 18 నుంచి జూన్ 18…

Read More

Telangana EAPCET Results: తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఫలితాలు వచ్చేశాయ్.. ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ లింక్ | Telangana EAPCET Exam results 2026 announced, Download rank card, marks memo online

హైదరాబాద్‌, మే 17: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్) 2026 ఫలితాలు ఆదివారం (మే 17) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా ఫలితాలు వెల్లడించారు. ఈఏపీసెట్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా ఫలితాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తాజా…

Read More