Headlines

చికెన్ కూర స్నేహితుడి ప్రాణం తీసింది.. అహోబిలంలో విషాదం! | Chicken Curry Claims Friend’s Life, Tragedy in Ahobilam, Kurnool District

చికెన్ వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో వెలుగుచూసింది. కేవలం టమోటా చట్నీ చేసినందుకు ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎరుకల శంకర్, వడ్డే శివ స్నేహితులు. వీరిద్దరూ అహోబిలం గ్రామ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఒకే గదిలో నివసిస్తున్నారు. ఇద్దరికీ…

Read More

రన్నింగ్ ట్రైన్‌లో విలువైన వస్తువులు మాయం.. పోలీసుల ఆపరేషన్‌లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..! | A railway official caught by the police while committing thefts on trains in Kurnool District

రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి రైళ్లలో ఉచితంగా, తరచుగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రజల సేవకు…

Read More

Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా.. | Kurchi Tatha Alias Mohammed Pasha Passes away suddenly due to heart attack

సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని కృషకాంత్ పార్కులో బుధవారం (మే20) ఉదయం వాకింగ్ చేసుండగా ఆయన ఒక్క సారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతమున్న ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగానే కుర్చీతాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కుర్చీతాత మరణ వార్త తెలుసుకున్న సినీ అభిమానులు,…

Read More

CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో | AP CM Chandrababu Naidu and Nara Bhuvaneshwari Stops Convoy to Eat Palm Fruit at Kuppam, Video Goes Viral

ఎటు చూసినా కాన్వాయ్ సైరన్లు, చుట్టూ NSG, SSG భద్రతా సిబ్బంది హడావుడి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అంటే సాధారణంగా కనిపించే దృశ్యం.. కానీ, తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆగింది. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, భార్య భువనేశ్వరితో కలిసి ఆయన చేసిన ఒక సాదాసీదా పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. కుప్పం పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు దంపతులు తాము…

Read More

Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..

వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ యువకుడికి దేహశుద్ధి చేసి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగించారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్ల్ గ్రామంలో అవమానకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు భాస్కర్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా యువకుడు భాస్కర్ కు అరగుండు కొట్టించి మెడలో చెప్పులు దండ వేసి ఊళ్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో నడిపించుకుంటూ యువకుడు భాస్కర్ ను…

Read More

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Monsoon and Weather Update: Rain Alert Along With Heatwave in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య…

Read More

రైళ్లలో ఆదమరిచి నిద్రపోతున్నారా..? ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త!.. కట్‌చేస్తే..

రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బ్యాగ్ లిఫ్టింగ్‌కు పాల్పడుతున్న కిలేడీ దొంగను కర్నూలు రైల్వే, ఆర్‌పీఎఫ్ (RPF) పోలీసులు బుధవారం ఉమ్మడిగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఆదోనిలో రైల్వే శాఖలోనే జూనియర్ ఇంజనీర్ (JE) గా పనిచేస్తున్న పి. బాలరాజుగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) కర్నూలు జిల్లా ఆదోనిలో రైల్వే…

Read More

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు: ఎమ్మెల్సీ నాగబాబు | MLC Naga Babu Lays Foundation To Sirivennela Memorial Park In Anakapalle, Details Inside

ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి చెంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి అని రాష్ట్ర శాసనమండలి సభ్యులు కె. నాగబాబు తెలిపారు. ఆయన ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్‌లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సిరివెన్నెల స్మృతివనం’కు నాగబాబు బుధవారం (మే 20) శంకుస్థాపన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ..’…

Read More

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త | Andhra Pradesh and Telangana Heatwave Alert: Record Temperatures and Weather Warnings

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో అత్యధికంగా నిర్మల్‌లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలో ఎండలు మరింత తీవ్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర…

Read More

Andhra: రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే.. | Kadapa Retired Officer Builds His Own Grave Beside Wife’s Tomb as a Symbol of Eternal Love

మూడుముళ్ళతోనే వారి బంధం ఉండి పోవాలని అనుకోలేదు.. చనిపోయిన తర్వాత కూడా చిరకాలం తనతోనే ఉండాలని భార్య చనిపోయిన తరువాత ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందస్తు సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. కడప జిల్లా చిన్న చౌక్ లోని కోపరేటివ్ కాలనీకి చెందిన పి రామ్మోహన్ రాజు, రాజ్యలక్ష్మి దంపతులకు 1978లో వివాహమైంది. పిఎఫ్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసిన రామ్మోహన్ రాజు ఏపీ వైద్య విద్య సహాయ సంచాలకులుగా కూడా…

Read More