Nara Lokesh: సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల బోట్ల వందనం.. మంత్రి లోకేష్ అదిరిపోయే గిఫ్ట్! | AP Fishermen give Krishna River Boat Salutation to CM Chandrababu, Nara Lokesh shows his Hospitality by hosting them
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో ఏడాది కూడా ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధులు విడుదల చేయడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు చెప్పేందుకు వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు సుమారు వంద బోట్లతో కృష్ణానది గుండా ముఖ్యమంత్రి నివాసానికి తరలివచ్చారు. కృష్ణమ్మ ఒడిలో వందలాది పడవలు ఒకేసారి కదలివస్తుంటే అమరావతి తీరం సరికొత్త శోభను సంతరించుకుంది.
