రైళ్లలో ఆదమరిచి నిద్రపోతున్నారా..? ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త!.. కట్చేస్తే..
రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బ్యాగ్ లిఫ్టింగ్కు పాల్పడుతున్న కిలేడీ దొంగను కర్నూలు రైల్వే, ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు బుధవారం ఉమ్మడిగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఆదోనిలో రైల్వే శాఖలోనే జూనియర్ ఇంజనీర్ (JE) గా పనిచేస్తున్న పి. బాలరాజుగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) కర్నూలు జిల్లా ఆదోనిలో రైల్వే…
