ఎడారిలా మారిన కొల్లేరు.. ఆకలితో అలమటిస్తున్న విదేశీ పక్షులు
ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన ఈ చిత్తడి నేలలు, ఇప్పుడు పక్షుల మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, పక్షులకు ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా, ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ఏటికేటికీ పడిపోతోందనే వాడన్ సైతం బలంగా వినిపిస్తుంది . మండవల్లి మండల పరిధిలోని పెద్దయడగాడి వంటి ప్రధాన ప్రాంతాల…
