Headlines

12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..

హేమాహేమీ ఆఫీసర్లు రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు…! టెక్నాలజీకి చిక్కట్లేదు…! శాస్త్రానికి అంతుపట్టట్లేదు…! ఒకరోజు మిస్సింగ్ అంటారు..! మరో రెండ్రోజుల తర్వాత కిడ్నాప్ అంటారు…! యానిమల్ ఎటాక్ ఏమైనా జరిగిందేమోనని కూడా అనుమానించారు…! గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని.. 500 మందితో జల్లెడ పట్టినా జాడ కనిపించలేదు. మరి చిన్నారి జాహ్నవి ఏమైనట్టు…? పన్నెండు రోజులైనా పట్టుకోకపోవడమేంటి…? ఈ మిస్టరీని ఛేదించేదెలా…? రక్తంపంచుకుని పుట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే ఎలా ఉంటుంది…?…

Read More

Tuni: బుజ్జి తల్లీ ఎక్కడున్నావమ్మా..? పాప మిస్సింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్స్..

కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్థులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో ఈ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోటలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న జాహ్నవి ఆడుకుంటూ…

Read More

ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం! | Village Excommunication Imposed on 43 Families in Thotapeta, Kakinada District

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 43 కుటుంబాలను గ్రామ పెద్దలు గత పది నెలలుగా వెలివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఊరిలోని కిరాణా కొట్లలో వీరికి సరుకులు…

Read More