Headlines

పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన మహిళ ఎస్సై | Female SI Caught Red Handed by ACB While Accepting Bribe at Police Station

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో బోయినపల్లి పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై నందిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో సహకారం అందించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై నందిత బాధితుడిని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “స్టేషన్‌లో అందరికీ వాటాలు ఇవ్వాలి” అంటూ అదనంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఈ వ్యవహారాన్ని…

Read More

ఫ్లెక్సీల అరాచకానికి చెక్.. రూల్స్ అతిక్రమిస్తే ఉపేక్షించను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు | CM Revanth Reddy orders police overhaul, zero tolerance on corruption and negligence, flexies,

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇకపై ఫ్లెక్సీల విషయంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, హైడ్రా, మున్సిపల్, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేసి జూన్ 15 లోగా సమగ్ర…

Read More

స్నానం చేయలేదని తల్లి మందలించిందనీ.. బావిలోకి దూకిన బాలిక! ఆ తర్వాత ఏం జరిగిందంటే | 17 year old Girl attempts suicide after being reprimanded for skipping bath

ఆసిఫాబాద్, మే 21: స్నానం చేయకుండా అదే పనిగా ఫోన్‌ చూస్తున్న కూతురిని ఓ తల్లి మందలించింది. అంతే మనస్తాపానికి గురై ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో సమాయానికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. Mysterious: గంపెడు ఆశతో…

Read More

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. మంత్రులందరినీ ఢిల్లీలోనే ఉండాలని ఆదేశం! | PM Modi calls crucial council meeting today, all ministers asked to stay in Delhi

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే, దేశ రాజధాని ఢిల్లీలోని సేవా తీర్థంలో గురువారం (మే 21)సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరగనుంది. రాజకీయ, ఆర్థిక పరిణామాలు ముమ్మరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ భేటీలో కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులు కూడా పాల్గొననున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ…

Read More

Mysterious: గంపెడు ఆశతో చేపల కోసం వెళ్తే.. జాలరి వలలో చిక్కింది చూసి షాక్‌! | Mysterious object caught in fishermen’s net in Tiruvallur district of Tamil Nadu

పొన్నేరి, మే 21: తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లాలో దాదాపు 30కిపై గ్రామాలకు చెందిన జాలరులు పోన్‌పే సరస్సులో, సముద్రంలో చేపలు పడుతుంటారు. పొన్నేరు సమీపం పళవేర్కాడు పాసియావరానికి చెందిన జాలరి దైవప్రకాశం నలుగురితో కలిసి పడవలో అక్కడి సముద్రంలో మంగళవారం సాయంత్రం ఎప్పటిమాదిరిగానే చేపలు పట్టేందుకు వల విసిరాడు. ఇంతలో వారి వల భారీగా బరువెక్కింది. దండిగా చేపలు పడి ఉంటాయని ఆశతో వలను బయటకు లాగారు. అయితే వలలో చేపలకు బదులు సుమారు 10 కిలోల…

Read More

దేశం కోసం ఒక అడుగు.. మన బంగారం – దేశానికి శ్రీరామరక్ష! మేధావుల బహిరంగ విజ్ఞప్తి! | How you help the government by selling 100 grams of gold understand the complete calculation

భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు; అది సంప్రదాయం, సంస్కృతి, అత్యవసర కాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. అయితే, ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆనంద్ రాఠీ వెల్త్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశం తన అవసరాలకు మించి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల…

Read More

హోటల్ రూమ్‌లో దొరికిన జంట.. పోలీస్ స్టేషనే పెళ్లి వేదిక.. ప్రియురాలు హ్యాపీ.. ప్రియుడు షాక్! | Bihar: patna couple staying in hotel police arranged their marriage bride elated but groom crying

బీహార్ రాజధాని పాట్నాలో ఒక విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై స్టేషన్ ప్రాంగణంలోని గుడిలోనే వారికి పెళ్లి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వివాహం ఇద్దరి మధ్య సమ్మతితో జరిగినట్లు కాకుండా, ఒకరికి పరమానందం, మరొకరికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. నవాడా జిల్లాకు చెందిన రాజేష్, సవిత (పేర్లు మార్చబడ్డాయి) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. సుమారు…

Read More

Heatwave: అగ్నిగుండంలా మండుతున్న భారత్.. 50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణలో | India Scorched by Severe Heatwave: IMD Issues Red Alerts Across Telangana, Andhra Pradesh and North India

దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుటెండలు, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం రాబోయే ఆరు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగనుంది. బలూచిస్తాన్, రాజస్థాన్ థార్ ఎడారి నుంచి వీస్తున్న వేడి గాలులు ఉత్తర, మధ్య భారత్‌లో వడగాలుల పరిస్థితులను తీవ్రతరం చేస్తున్నాయి.వాతావరణ అంచనాలను…

Read More

నోరు లేని జీవిపై నరరూప రాక్షసుల వికృత చేష్ట.. రక్తపు మడుగులో ‘రైతు బిడ్డ’..!

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానిక రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషుల మధ్య ఉండాల్సిన కక్షలను అమాయకపు మూగజీవిపై చూపించి, తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోసిగి మండలం కేంద్రానికి చెందిన రైతు నాగరాజుకు చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దుపై దుండగులు వేటకొడవలితో కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో…

Read More

UGC NET June 2026: విద్యార్ధులకు మరో ఛాన్స్.. యూజీసీ నెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు! ఎప్పటివరకంటే.. | UGC NET June 2026 exam registration deadline extended: Check revised Schedule here

హైదరాబాద్‌, మే 21: యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) 2026 జూన్‌ సెషన్‌ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్రటకన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు ప్రక్రియ మే 20తో ముగిసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును 2026 మే 23వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు నెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మే 23, 2026వ తేదీలోపు…

Read More