Headlines

భవిష్యత్‌కు దారి చూపే మహా విద్యా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 | TV9 & KAB Education Expo 2026 to Guide Students Towards the Right Career Path

TV9 and KAB Education Expo 2026: హైదరాబాద్‌లో ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ఉన్నత విద్యా ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 మే 22 నుంచి మే 24, 2026 వరకు ప్రతిష్టాత్మకమైన HITEX Exhibition Centre లో ఘనంగా నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించి,…

Read More

Andhra News: లవ్వంటూ.. డాక్టర్‌కు పదేపదే మెసేజ్‌లు.. సీన్‌కట్‌చేస్తే.. ఇదీ పరిస్థితి | Vizianagaram Doctor Harassment: Man Arrested for Stalking via Phone and Messages

విజయనగరం జిల్లా రాజాంలో ఓ మహిళా వైద్యురాలిని ప్రేమ పేరుతో పదేపదే వేధించిన ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెర్లాం మండలానికి చెందిన బాధితురాలు బొబ్బిలి జంక్షన్‌లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోనే షాపు నిర్వహిస్తున్న పవన్ అనే వ్యక్తి.. క్లినిక్‌ బోర్డు పై ఉన్న నంబర్‌ను సేకరించి తరచూ ఫోన్ కాల్స్ చేయడంతో పాటు ప్రేమ పేరుతో మెసేజ్‌లు చేయడం స్టార్ట్ చేశాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో వైద్యురాలు…

Read More

మిస్సింగ్ అని ఆశ పెట్టారు..చివరకు మృతదేహం గుర్తించామని చెప్పారు! సురేష్ మృతితో విషాదసాగరం | He Said He Would Return in 10 Days, But Never Came Back: Visakhapatnam Engineer Killed in Oman Attack

సాగర తీరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన ఘటన వెలుగుచూసింది. పది రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి వెళ్లిన ఒక ఇంజనీర్, విధి నిర్వహణలో ఉండగా దేశం కాని దేశంలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక పెద్ద నౌకపై అమెరికా చేసిన క్షిపణి దాడిలో విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ దాడిలో మరణించిన ముగ్గురిలో…

Read More

RRB Railway Jobs 2026: రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు | RRB ALP Recruitment 2026 Notification Released for 11,127 Posts, Apply Online

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో.. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతతో భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 15వ తేదీ నుంచి ఈ కింది ఆన్‌లైన్‌ లింక్‌లో…

Read More

ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా | Vizianagaram AC Explosion: Short Circuit Blamed, Summer Safety Tips

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏసి పేలి భయాందోళనలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణానికి చెందిన స్కూల్ టీచర్ డర్రు అప్పన్న నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పన్న ఇంట్లో ఎప్పటిలాగే ఇంటిని శుభ్రం చేయడానికి పనిమనిషి వచ్చింది. అలా వచ్చిన పనిమనిషి ఓ బెడ్ రూమ్ లోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేసింది. అంతే భారీ పేలుడు శబ్దాలతో కూడిన మంటలు, దట్టమైన పొగ క్షణాల్లో గదిని ఆక్రమించాయి….

Read More

ప్రతి శనివారం బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీలో కొత్త నిబంధన | AP Schools Reopen from June 12; Academic Calendar for 2026 27 Released

అమరావతి, జూన్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (జూన్ 12) నుండి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో రేపటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం మొదలవనుంది. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది. 5 ఐచ్ఛిక సెలవులు, 3 స్థానిక సెలవులు రానున్నాయి. అలాగే ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు పదో తరగతి పబ్లిక్…

Read More

గుర్తుందా.. ఒకప్పుడు మనవి ఎర్రబస్సులు.. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోకి ఎందుకు మార్చారంటే.. | Do you Know Why Telugu States Bus Colour Changed From Red to Green and white combination

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. అంతకుముందు ఆర్టీసీ ఎండీ కూడా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణ, ఆ తర్వాత ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో ఆయన కృషి చాలా ఉంది. హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు, క్రైమ్ రేట్‌ను తగ్గించడానికి, రౌడీయిజాన్ని అరికట్టడానికి మురళీధర్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. నగరంలో సబ్‌ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసి, ప్రతి పోలీస్…

Read More

నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకుని అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు, అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం (మే 13) రాత్రి 1:58 గంటలకు వైభవంగా వివాహమైంది. వరుడి…

Read More

Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..

వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ యువకుడికి దేహశుద్ధి చేసి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగించారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్ల్ గ్రామంలో అవమానకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు భాస్కర్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా యువకుడు భాస్కర్ కు అరగుండు కొట్టించి మెడలో చెప్పులు దండ వేసి ఊళ్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో నడిపించుకుంటూ యువకుడు భాస్కర్ ను…

Read More

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్‌లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు.. | AP Government Sanctions 895 New Pensions under NTR Bharosa scheme for Chronic Disease Patients

ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పేదలు వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు….

Read More