Headlines

Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా.. | Kurchi Tatha Alias Mohammed Pasha Passes away suddenly due to heart attack

సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని కృషకాంత్ పార్కులో బుధవారం (మే20) ఉదయం వాకింగ్ చేసుండగా ఆయన ఒక్క సారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతమున్న ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగానే కుర్చీతాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కుర్చీతాత మరణ వార్త తెలుసుకున్న సినీ అభిమానులు,…

Read More

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు! | Milk Prices Increased Again: Amul and Mother Dairy Shock Consumers

నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు దేశీయ దిగ్గజ డైరీ సంస్థ అమూల్ (Amul) మరో చేదు వార్త చెప్పింది. అమూల్ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 500 మి.లీ అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ఒక్కో రూపాయి పెరిగాయి. అమూల్ బాటలోనే మదర్ డైరీ కూడా ఢిల్లీ-NCR, ఇతర…

Read More

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల | AP Forest Department Recruitment 2026 Notification released to fill 40 posts in under sports quota

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మే 18 నుంచి జూన్ 18…

Read More

Weather Report: ముంచుకొస్తున్న నైరుతి.. ఏపీ, తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో.. | Rain Alert Issued for Andhra Pradesh and Telangana for Next Three Days

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక గురువారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఒడిస్సా కోస్తా…

Read More

Eid Al Adha 2026: బక్రీద్ సెలవుపై బిగ్ ట్విస్ట్.. పండగ ఆ రోజు కాదు.. ఎప్పుడంటే..? | Bakrid to Be Celebrated on May 28 2026 as Dhul Hijjah Moon Sighting Delayed, Eid Ul Adha Holiday Postponed

ఈద్ అల్-అధా (బక్రీద్) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన ధు అల్-హిజ్జా 10వ రోజున వస్తుంది.. అయితే.. ఈ సారి బక్రీద్ పండుగ తేదీపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. దుల్ హిజ్జా (Dhul-Hijjah) నెలవంక దర్శనం ఆలస్యం కావడం.. దీంతో పండుగ తేదీ మారిందని.. పండుగను అనుకున్న రోజు తర్వాత నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు…

Read More

Kodi Rammurthy Naidu: తెలుగు జాతి కీర్తి పతాకం.. కలియుగ భీముడు.. కానీ జీవిత చరమాంకంలో… | Kodi Rammurthy Naidu: Indias Hercules, Telugu Strongman His Feats

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం నుంచి ప్రపంచ వేదికపై బల ప్రదర్శనలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అసాధారణ బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు. 1883 నవంబర్ 3న వీరఘట్టంలోని తెలగ వీధికి చెందిన కోడి వెంకన్న నాయుడు, అప్పలకొండ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే వ్యాయామంపై అమితాసక్తి కనబరిచారు. చదువు కంటే కసరత్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, రెండో తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. పది, పన్నెండేళ్ల వయసులోనే 500 మీటర్ల రాజచెరువులో అలసిపోకుండా ఐదారుసార్లు అటునుంచి ఇటు స్విమ్మింగ్…

Read More

ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహానంది సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చిన ఒక ఆడ పెద్దపులి, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణుల రక్షణకు కేంద్రంగా ఉన్న నల్లమల అడవుల్లో ఈ ఘటన జరగడం పర్యావరణ ప్రేమికులను, అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గాజులపల్లి రైల్వే స్టేషన్ నుండి చలమ రైల్వే స్టేషన్ మధ్య…

Read More

రెచ్చిపోతున్న గంజాయి ముఠా.. అర్థరాత్రి విచ్చలవిడిగా దాడులు! | A gang under the influence of marijuana brutally attacked six youths in Mancherial district

మంచిర్యాల, మే 17: మంచిర్యాల జిల్లాలో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి అత్యవసరంగా బయటకి వస్తున్న వారే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతున్నారు‌. ముందుగా గొడవలు పెట్టుకుని కత్తులు, రాడ్లతో దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. అర్దరాత్రి రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ.. అత్యవసరంగా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ముందుగా బెదిరించడం, వినక పోతే దాడులకు పాల్పడటం పరిపాటిగా మారుతోంది. తాజాగా గంజాయి మత్తులో ఓ మూక సృష్టించిన విధ్వంసం సంచలనంగా మారింది….

Read More

Greenfield National Highway: కేవలం 6 గంటల్లోనే విజయవాడ టూ బెంగళూరు.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే..? | Bengaluru–Kadapa–Vijayawada Greenfield Highway Works Speed Up in andhra pradesh

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవేల పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అనేక జాతీయ రహదారులు రాష్ట్రం గుండా వెళుతుండగా.. ఇప్పుడు మరికొన్ని రహదారుల పనులు షురూ అయ్యాయి. అందులో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుండగా.. దీని రాకతో ఏపీ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక, ఏపీని ఈ హైవే కలపనుంది. అధునాతన సౌకర్యాలతో…

Read More

AP PGECET 2026 Result: ఏపీ పీజీఈసీఈటీ-2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..! | AP PGECET 2026 results out, check how to download rank card, merit list, released by Minister Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసీఈటీ (AP PGECET)-2026 పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు గురువారం (మే 14) సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ఈ ఏడాది ఏపీ పీజీఈసీఈటీ పరీక్షకు మొత్తం 9,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 9,320 మంది…

Read More