Headlines

రైళ్లలో ఆదమరిచి నిద్రపోతున్నారా..? ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త!.. కట్‌చేస్తే..

రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బ్యాగ్ లిఫ్టింగ్‌కు పాల్పడుతున్న కిలేడీ దొంగను కర్నూలు రైల్వే, ఆర్‌పీఎఫ్ (RPF) పోలీసులు బుధవారం ఉమ్మడిగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఆదోనిలో రైల్వే శాఖలోనే జూనియర్ ఇంజనీర్ (JE) గా పనిచేస్తున్న పి. బాలరాజుగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) కర్నూలు జిల్లా ఆదోనిలో రైల్వే…

Read More

Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే.. | Know Trisha Krishnan Remuneration For Suriya Karuppu Movie

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. ‘కరుప్పు’ చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్…

Read More

అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్ | Weather Update: Southwest Monsoon Advances Further in Andhra Pradesh, More Areas Likely to Receive Rains in Next 72 Hours

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.. ఓ వైపు ఎండలు దంచికొడుతుండంగా.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, నైరుతి రుతుపవనాలు(జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.. రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ…

Read More

సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ.. ఇదిగో వీడియో | Not a Movie Scene: Police Save Youth Seconds Before Train Accident in Visakhapatnam

విశాఖపట్నంలో సిటీ పోలీసులు, రైల్వే పోలీసులు ఉమ్మడిగా జరిపిన ఆపరేషన్‌లో ఒక యువకుడి ప్రాణం తృటిలో తప్పింది. మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో అలర్ట్ అయిన సీపీ బాగ్చి, మొబైల్ లొకేషన్ ఆధారంగా రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. ఒకవైపు రైలు వేగంగా వస్తుండటం, మరోవైపు యువకుడు దానికి ఎదురెళ్లడం గమనించిన ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు రైల్వే ట్రాక్‌పై అర కిలోమీటరు…

Read More

సామాన్యుడి చేతిలోకి సరికొత్త అస్త్రం.. సైబర్‌ నేరాలకు చెక్ పెట్టే ఏఐ చాట్‌బాట్.. ఎలా వాడాలంటే? | CBI Launches ABHAY AI Tool to Check Fake Notices and Curb Digital Arrest Scams

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పికప్పుడూ చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ అభయ్ అనే సరికోత్త ఏఐ ఆధారిత వెరిఫికేషన్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇది మీకు వచ్చిన సీబీఐ నోటీసు అసలైనదా? లేక కేటుగాళ్లు సృష్టించిన నకిలీదా? అనే విషయాన్ని ఇకపై కేవలం ఒక్క క్లిక్‌తో, నిమిషాల వ్యవధిలోనే కనిపెడుతుంది. దీన్ని ఇప్పుడు సామాన్య పౌరులు కూడా యాక్సెస్ చేయవచ్చు. భారత చట్టంలో…

Read More

భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే

తిరుపతి నగరంలో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై బాబాయ్ అఘాయిత్యం సంచలనంగా మారింది. ఈ మేరకు ఈస్ట్ పీఎస్ లో నమోదైన పోక్సో కేసు సంచలన విషయాలను బయటపెట్టింది. వరుసకు కూతురైన బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి, అందుకు సహకరించిన భార్య ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన రామ్మూర్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే రామ్మూర్తి GST కార్యాలయంలో…

Read More

వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం.. | Poor Veda Student Denied Entry Over rs 8,000 Fine; Parents Seek Justice video tv9d

పవిత్రమైన వేదపాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధులకు వేదం, చదువు, సంస్కారం నేర్పించాల్సిన వేదపాఠశాలో కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ ఓ పేద విద్యార్ధిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం వేద పాఠశాలలో రాజమండ్రికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్న తర్వాత పాఠశాలకు తిరిగి రావడంలో ఎనిమిది…

Read More

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్! | NDA Alliance progress card in Tirupati: Grand meeting on two years of governance

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More

Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు! | Real Life ‘Thammudu’ Stunt in Tadipatri: Brothers Let 100 Cars and 100 Bikes Run Over Them

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్కీ, విక్కీ అనే అన్నదమ్ములు తమ అసాధారణ సాహస విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాడిపత్రి పట్టణంలోని అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల ఒక సాహస ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అకాడమీకి చెందిన అన్నదమ్ములు లక్కీ, విక్కీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారు నేలపై బోర్లా పడుకుని తమ చేతులను ముందుకు చాచగా, ఒకదాని వెనుక ఒకటిగా ఏకంగా 100 కార్లు వారి చేతులపై నుండి దూసుకెళ్లాయి. అంతటితో ఆగకుండా,…

Read More

ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు మంగళవారం ప్రవేశించిన సంగతి తెలిసిందే. జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రాకతో రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భీకరమైన ఎండలు, ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న ప్రజలను.. చిరు జల్లులు పలకరిస్తున్నాయి. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌ నగరంలోనూ…

Read More