Headlines

Yuvva Kumarr Miriyala

అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్ | Weather Update: Southwest Monsoon Advances Further in Andhra Pradesh, More Areas Likely to Receive Rains in Next 72 Hours

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.. ఓ వైపు ఎండలు దంచికొడుతుండంగా.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, నైరుతి రుతుపవనాలు(జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.. రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ…

Read More

UPSC Prelims Result Date 2026: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్ ఫలితాలపై సస్పెన్స్.. కటాఫ్ తగ్గే అవకాశం! | UPSC Civil Services Prelims 2026 Results Expected Soon; Candidates Await Outcome

హైదరాబాద్‌, జూన్‌ 11: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026 ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. మే 24వ తేదీన యూపీఎస్సీ సివిల్ సర్వీసెట్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 5.49 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 933 ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసుల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్ష జరిగిన నాలుగు రోజులకే…

Read More

Weather Alert: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య .. ఏపీ, తెలంగాణలో పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. నైరుతి రుతుపవనాలు (జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీరప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం…

Read More

Thalliki Vandanam: త్వరలోనే అకౌంట్లోకి తల్లికి వందనం.. ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్.. ప్రభుత్వం అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో బడి గంటకు వేళైంది. జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్‌ ప్రారంభం అవుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ అనంతరం స్కూల్స్ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీంతో 2026-2027 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. విద్యా క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 229 పని దినాలు ఉండగా.. 87 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే విద్యా సంవత్సరం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో తల్లికి వందనం నిధుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు….

Read More

ప్రతి శనివారం బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీలో కొత్త నిబంధన | AP Schools Reopen from June 12; Academic Calendar for 2026 27 Released

అమరావతి, జూన్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (జూన్ 12) నుండి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో రేపటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం మొదలవనుంది. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది. 5 ఐచ్ఛిక సెలవులు, 3 స్థానిక సెలవులు రానున్నాయి. అలాగే ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు పదో తరగతి పబ్లిక్…

Read More

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్! | NDA Alliance progress card in Tirupati: Grand meeting on two years of governance

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి… | Tribal Woman Found Murdered in Parvathipuram Manyam District, Probe Intensified

ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే రోజులు ఇవి. అలాంటి విషాదకర ఘటన తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) దారుణ హత్యకు గురైంది. పాలకొండ మండలంలోని తుమరాడ సమీపంలో చింతాడకు వెళ్లే రహదారి పక్కన ఉన్న చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. దుండగులు ఉషారాణి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి,…

Read More

రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం! | AP first pilot training centre in Rajamahendravaram, foundation stone laid for FTO at a cost of rs100 crore

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోరుకొండ మండల పరిధిలో రూ.100 కోట్ల పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ పైలట్ శిక్షణ కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏవియేషన్ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలట్ల కొరతను తీర్చేందుకు ఈ శిక్షణ కేంద్రం కీలకంగా…

Read More

మిస్సింగ్ అని ఆశ పెట్టారు..చివరకు మృతదేహం గుర్తించామని చెప్పారు! సురేష్ మృతితో విషాదసాగరం | He Said He Would Return in 10 Days, But Never Came Back: Visakhapatnam Engineer Killed in Oman Attack

సాగర తీరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన ఘటన వెలుగుచూసింది. పది రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి వెళ్లిన ఒక ఇంజనీర్, విధి నిర్వహణలో ఉండగా దేశం కాని దేశంలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక పెద్ద నౌకపై అమెరికా చేసిన క్షిపణి దాడిలో విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ దాడిలో మరణించిన ముగ్గురిలో…

Read More

Tuni: బుజ్జి తల్లీ ఎక్కడున్నావమ్మా..? పాప మిస్సింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్స్..

కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్థులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో ఈ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోటలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న జాహ్నవి ఆడుకుంటూ…

Read More