Headlines

Andhra Pradesh: ప్రాణాల మీదకు తెచ్చిన పునుగులు.. ఆస్పత్రిలో 11మంది.. అసలేం జరిగిందంటే..?

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్. కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు మరికొందరు కలిపి మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో రెండేళ్ల పసిబాలుడు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా నిల్వ ఉంచిన పిండితో చేసిన పదార్థాలు తినడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయి తెలిపిన…

Read More

NEET vs JEE: నీట్ లీకేజీ కారణాలు.. జేఈఈ విజయ రహస్యాలు | JEE Success Secrets Revealed: Key Analysis of Possible NEET Question Paper Leaks

భారతదేశంలో పోటీ పరీక్షల వ్యవస్థ మరోసారి తీవ్రమైన చర్చకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా NEET-UG వంటి పెద్ద పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు, రద్దులు, మళ్లీ పరీక్షలు వంటి పరిణామాలు విద్యార్థుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నీట్‌ను పెన్నూ, పేపరు విధానంలో 13 భాషలలో నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రాలన్నీ ప్రింట్ చేయడానికి, రవాణా చేయడానికి చాలా మంది అవసరమవుతారు. వీటినే కొందరు అవకాశంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో JEE Main వంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు…

Read More

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు! | Milk Prices Increased Again: Amul and Mother Dairy Shock Consumers

నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు దేశీయ దిగ్గజ డైరీ సంస్థ అమూల్ (Amul) మరో చేదు వార్త చెప్పింది. అమూల్ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 500 మి.లీ అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ఒక్కో రూపాయి పెరిగాయి. అమూల్ బాటలోనే మదర్ డైరీ కూడా ఢిల్లీ-NCR, ఇతర…

Read More

1.3 కోట్ల మందికి లీక్‌లేని పరీక్షలు: చైనా తీసుకుంటున్న కఠిన చర్యలు భారత్ కంటే ఎందుకు భిన్నం? | How China Prevents Exam Paper Leaks for 130 Million Students: Strict Measures Explained

భారత్‌లో NEET, JEE Advanced వంటి భారీ పోటీ పరీక్షలు ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే ఈ పరీక్షల నిర్వహణ ఎంత పెద్దదో, అంతే సవాళ్లతో కూడుకున్నది కూడా. పేపర్ తయారీ నుంచి పరీక్ష కేంద్రాల వరకు అనేక దశల్లో వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, చిన్న లోపం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్షల భద్రత, పారదర్శకత, లీక్ నివారణ ఇవన్నీ ఎప్పుడూ చర్చలో ఉండే అంశాలు. ఈ…

Read More

Andhra: పొదల్లో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. ఏకంగా 3 కలిసి… | Rare Three Snake Mating Dance Stuns Villagers in Vizianagaram Watch

ఏపీలోని విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా రెండు పాములు మాత్రమే ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాట ఆడటం చూస్తుంటాం. అయితే ఈసారి ఒకేసారి మూడు పాములు కలసి గంటల తరబడి ఒకదానికొకటి చుట్టుకుంటూ, కదులుతూ, ఎగిరెగిరి సయ్యాట ఆడటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. గ్రామానికి చెందిన శివ్వాల ఫకీరు నాయుడుకు చెందిన కల్లం వద్ద ఈ…

Read More

హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Do you know where this amazing temple that celebrates Lord Hanuman’s wedding is located?

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, సింధూరాభిషేకాలు, తమలపాకులు, అరటి పళ్ళు, పనస తొనలతోను పూజిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే కోటిపల్లిలో ప్రత్యేకంగా భక్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆంజనేయస్వామికి కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా జరిపిస్తారు.

Read More

అంధురాలు.. పైగా వివాహిత.. ఆమెను ట్రాప్ చేసి లాడ్జ్‌కు.. ఆపై.. | Blind Woman Brutally Murdered in Ongole Lodge; Relative on the Run

ఒంగోలులో దారుణం జరిగింది. అంధురాలైన ఓ వివాహిత మహిళను ఆమె సమీప బంధువు ఓ లాడ్జిలో కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలు ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిలక్ష్మికి ఓ కొడుకు ఉన్నాడు. ఆమె భర్త కూడా ఆంధుడు కావడంతో.. పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తానని మృతురాలిని సమీప బంధువు వెంకటరమణ మభ్యపెట్టాడు. గత కొంతకాలంగా ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు గ్రామంలో ఆమె భర్త పంచాయతీ…

Read More

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం | Telangana Maize Floods AP Warehouses; Truck Drivers Stranded for 14 Days

తెలంగాణలో ఈసారి మొక్కజొన్న పంట బాగా పండింది. రైతులు ఆశించిన దిగుబడులు రావడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, గోడౌన్స్ అన్నీ మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయి. అయితే పంట ఎక్కువగా రావడం ఇప్పుడు రైతులకే కాదు.. లారీ డ్రైవర్లకు కూడా పెద్ద కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రుపాలెం, కొణిజర్ల, చింతకాని, నాగలవంచ, మధిర ప్రాంతాల సొసైటీల నుంచి భారీగా మొక్కజొన్నను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేర్‌హౌస్ గోడౌన్స్ ప్రస్తుతం పూర్తిగా…

Read More

British Scholarships 2026: బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల పూర్తి గైడ్ ఇక్కడే! | British Scholarships 2026: Complete Guide for Indian Students to Study in the UK for Free

బ్రిటిష్ ప్రభుత్వం, యూకేలోని వివిధ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ప్రతి సంవత్సరం బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. వీటిలో ట్యూషన్ ఫీజులతో పాటు జీవన ఖర్చులు కూడా భరించబడే అవకాశముంది. ప్రధాన స్కాలర్‌షిప్‌లు చెవెనింగ్ స్కాలర్‌షిప్ (Chevening Scholarship): ఇది బ్రిటిష్ ప్రభుత్వపు అత్యంత ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లలో ఒకటి. నాయకత్వ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ఏ విభాగంలోనైనా ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి పూర్తిగా ఆర్థిక సహాయం అందిస్తుంది. కామన్వెల్త్…

Read More

Weather: అబ్బ.. చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్.. | Latest Weather Update: Rain Alert in Andhra Pradesh and Telangana as Bay of Bengal Low Pressure Continues

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. బుధవారం వరకు ఎండలు దంచికొట్టగా.. గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్నటి…

Read More