Headlines

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు | AP and TS Weather Update: Heatwaves, Rains, Monsoon Forecast Protect Yourself from Heatstroke video tv9d

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఎండల తీవ్ర నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు ,రాయలసీమ ప్రాంతంలో వర్షాల…

Read More

AP PGECET 2026 Result: ఏపీ పీజీఈసీఈటీ-2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..! | AP PGECET 2026 results out, check how to download rank card, merit list, released by Minister Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసీఈటీ (AP PGECET)-2026 పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు గురువారం (మే 14) సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ఈ ఏడాది ఏపీ పీజీఈసీఈటీ పరీక్షకు మొత్తం 9,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 9,320 మంది…

Read More

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్‌లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు.. | AP Government Sanctions 895 New Pensions under NTR Bharosa scheme for Chronic Disease Patients

ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పేదలు వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు….

Read More

బిగ్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో SIR.. ఎప్పటినుంచో తెలుసా..? | Election Commission Announces SIR Phase 3 in Andhra Pradesh, Telangana among 16 States 3 UTs, Here’s the Full Schedule

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫేజ్-3ను ప్రకటించింది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దశలవారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపనుంది. ఏపీ,తెలంగాణ సహా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ దశలవారీగా జరగనుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను తదుపరి ఫేజ్ లో SIR ప్రక్రియ జరగనుంది. జనగణన, గృహ జాబితా ప్రక్రియలతో కలిపి ఈ SIR ఫేజ్-3ను నిర్వహించనున్నట్లు…

Read More

మున్సిపల్ టాక్స్ కట్టలేదని.. చెత్తతో భలే ట్రీట్మెంట్ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది! | Municipal Staff dumped garbage in front of function hall to collect unpaid tax dues in Punganur, Annamayya District

పన్నుల వసూలు కోసం మున్సిపల్ అధికారులు వినూత్న, దూకుడు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో పన్నులు చెల్లించని ఒక ఫంక్షన్ హాల్ యజమానికి మున్సిపల్ సిబ్బంది గట్టి షాక్ ఇచ్చారు. బల్క్ వేస్టేజ్ (భారీ వ్యర్థాల) తొలగింపు పన్నులను దీర్ఘకాలంగా చెల్లించకుండా మొండికేస్తున్న విబిఎస్ ఫంక్షన్ హాల్ ప్రధాన గేటు ముందే మున్సిపల్ సిబ్బంది ఏకంగా చెత్తను తెచ్చి డంప్ చేశారు. నిబంధనల ప్రకారం ఫంక్షన్ హాల్‌లో ఏదైనా శుభకార్యం జరిగితే, వ్యర్థాల…

Read More

నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకుని అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు, అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం (మే 13) రాత్రి 1:58 గంటలకు వైభవంగా వివాహమైంది. వరుడి…

Read More

ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు.. అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి! | CM Revanth Reddy lashes Modi government took an autocratic decision regarding cancellation of NEET UG 2026

నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆయన మండిపడ్డారు. ఈ రద్దు నిర్ణయం గతంలో దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్) వంటిదేనని సీఎం అభివర్ణించారు. వ్యవస్థీకృత పేపర్ లీక్‌లు, ప్రభుత్వ…

Read More