రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం! | AP first pilot training centre in Rajamahendravaram, foundation stone laid for FTO at a cost of rs100 crore
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోరుకొండ మండల పరిధిలో రూ.100 కోట్ల పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ పైలట్ శిక్షణ కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏవియేషన్ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలట్ల కొరతను తీర్చేందుకు ఈ శిక్షణ కేంద్రం కీలకంగా…
