Headlines

Andhra: నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి.. | Facebook Love Turns Sour: Chhattisgarh Woman Alleges Harassment by Husband in Tadepalli Guntur district


ఏడాది క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహం కొనసాగి ప్రేమగా మారింది. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అంగీకరించిన పెద్దలు తమ సమక్షంలోనే వివాహం జరిపించారు. ఆ తర్వాత.. కాపురం పెట్టిన కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయి. అన్నం పెట్టకుండా వేధిస్తుండటంతో భార్య స్థానికుల సాయంతో పోలీసులకు చెంతకు చేరింది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్ కు చెందిన ఊర్మిళతో తాడేపల్లికి చెందిన నాగరాజుకు ఫేస్‌బుక్ లో పరిచయం ఏర్పడింది. కొద్దీ కాలం తర్వాత ప్రేమించుకుంటున్నామంటూ పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఐదు లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చారు. ఆ తర్వాత తాడేపల్లిలో కాపురం పెట్టారు.

ఈ క్రమంలోనే నాగరాజుకు అంతకుముందే రెండు వివాహాలై విడాకులైనట్లు ఊర్మిళా గుర్తించింది. అప్పటి నుండి ఇరువురి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఊర్మిళ తన భర్తతో గొడవపడటాన్ని గుర్తించిన నాగరాజు బంధువులు.. ఆమెను వేధించడం మొదలు పెట్టారు. దీంతో వేరే కాపురం పెట్టాలంటూ ఉర్మిళ పట్టుబట్టింది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల కిందట అద్దెకు ఇల్లు తీసుకొని నాగరాజు ఊర్మిళను అక్కడికి తీసుకెళ్లాడు. కొత్త ఇంటిలో ఊర్మిళా తో ఆమె తల్లి కూడా నివసిస్తోంది.

గత నాలుగైదు రోజుల నుంచి ఊర్మిళాను ఆమె తల్లిని బయటకు రాకుండా నాగరాజు అడ్డుకుంటున్నాడు. మరొకవైపు అన్నం కూడా పెట్టకపోవడంతో ఆమెలో ఆందోళన మరింత పెరిగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. ఊర్మిళ పరిస్థితిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఉంటున్న నివాసం వద్దకు వచ్చి అమె బాధలు తెలుసుకొని పిఎస్ కు తీసుకెళ్లారు.

నాగరాజును పోలీస్ స్టేషన్ కు రావాలంటూ చెప్పారు. అయితే.. భర్త పెడుతున్న బాధలు తట్టుకోలేక తమ రాష్ట్రం చత్తీస్‌ఘడ్ కు వెళ్లిపోతామని బాధితులు పేర్కొన్నారు. తనను మోసం చేశాడని.. ఇప్పటికైనా పోలీసులు నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఊర్మిళ వేడుకుంటోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *