వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్! | Vizianagaram Police Crack Down on Repeat Offenders: PD Act Invoked Against Three Habitual Criminals
విజయనగరం జిల్లాలో వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అలవాటు ఉన్న నేరస్థులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేపాడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బొద్దాం గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు….
