Weather: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి.. సోమవారం ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో.. | Rain Alert for Andhra Pradesh: Thunderstorms Likely in Several Districts on Monday
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు, నైరుతి బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమవారం (జూన్ 15) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి…
