Headlines

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్! | Monsoon Brings Relief: Telugu States Transition from Heatwave to Cooler Weather – Viral Videos in Telugu

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండ, ఉక్కపోత మొదలు కావడంతో మధ్యాహ్నానికే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణలో భానుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చనున్నట్టు హెచ్చరించింది. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే ఆహారం…

Read More

రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం! | AP first pilot training centre in Rajamahendravaram, foundation stone laid for FTO at a cost of rs100 crore

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోరుకొండ మండల పరిధిలో రూ.100 కోట్ల పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ పైలట్ శిక్షణ కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏవియేషన్ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలట్ల కొరతను తీర్చేందుకు ఈ శిక్షణ కేంద్రం కీలకంగా…

Read More

Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే.. | UPI Fraud in Hindupur: Merchant Scammed of Rs 10,000 Using Fake Transaction Screen

యూపీఐ చేశానంటూ ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేలు కుచ్చుటోపి పెట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బియ్యం దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి 10 బస్తాలు కొనుగోలు చేశాడు. నగదు చెల్లించకుండా యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లించాడు. ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్‌ను బియ్యం వ్యాపారికి చూపించి, రైస్ బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు బ్యాంక్…

Read More

DRDO Paid Internship 2026: డిగ్రీ విద్యార్ధులకు భలే ఛాన్స్.. డీఆర్‌డీఓ ఏరోనాటికల్‌ సిస్టమ్‌లో 200 పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లు | DRDO DG (AERO) Paid Internship 2026 Notification Released, Application link here

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని డైరెక్టర్ జనరల్ (ఏరోనాటికల్ సిస్టమ్స్) ల్యాబ్‌లలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026-27 కింద అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్, సైన్స్ స్ట్రీమ్స్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 200 ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. ఎంపికైన వారు ADE,…

Read More

NEET vs JEE: నీట్ లీకేజీ కారణాలు.. జేఈఈ విజయ రహస్యాలు | JEE Success Secrets Revealed: Key Analysis of Possible NEET Question Paper Leaks

భారతదేశంలో పోటీ పరీక్షల వ్యవస్థ మరోసారి తీవ్రమైన చర్చకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా NEET-UG వంటి పెద్ద పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు, రద్దులు, మళ్లీ పరీక్షలు వంటి పరిణామాలు విద్యార్థుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నీట్‌ను పెన్నూ, పేపరు విధానంలో 13 భాషలలో నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రాలన్నీ ప్రింట్ చేయడానికి, రవాణా చేయడానికి చాలా మంది అవసరమవుతారు. వీటినే కొందరు అవకాశంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో JEE Main వంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు…

Read More

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్! | Vizianagaram Police Crack Down on Repeat Offenders: PD Act Invoked Against Three Habitual Criminals

విజయనగరం జిల్లాలో వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అలవాటు ఉన్న నేరస్థులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేపాడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బొద్దాం గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు….

Read More

90s nostalgia: డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ.. | 90s Nostalgia: Mud Houses, Village Life, Childhood Memories in Telugu

నేటి ఆధునిక యుగంలో మనం అపార్ట్‌మెంట్లు, ఏసీ గదుల్లో నివసిస్తున్నప్పటికీ, 90వ దశకంలోని మన చిన్ననాటి పల్లె జ్ఞాపకాలు, మట్టి ఇళ్లు, వర్షాకాలపు ఆటలు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. కరెంటు పోతే ఉక్కపోతతో సతమతమవుతున్నప్పుడు, ఆ మట్టి ఇళ్ల చల్లదనం ఎంత గొప్పదో గుర్తుకు వస్తుంది. ఆ మట్టి ఇళ్లు కేవలం గోడలు, కప్పు మాత్రమే కాదు, అవి ఆత్మీయతకు, ఆనందానికి నిలయాలు. మట్టి ఇళ్ల చల్లదనం, ఆరోగ్యం: ఎండకాలంలో సూర్యుడు మండుతున్నప్పుడు మట్టి ఇళ్లలోకి…

Read More

ఫిజిక్స్‌ టఫ్‌, కెమిస్ట్రీ సులభం.. చుక్కలు చూపించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌! ఈసారి కటాఫ్‌ మార్కులు ఎంతంటే? | JEE Advanced 2026 Result to be declared on June 1, Expected cut off marks here

హైదరాబాద్‌, మే 18: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం (మే 17) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలో పేపర్ 1, 2 ప్రశ్నాపత్రాలు కాస్త కఠినంగానే వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిజిక్స్‌ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. మ్యాథమెటిక్స్ మాత్రం మద్యస్థంగా వచ్చింది. కెమిస్ట్రీ కాస్త సులువుగా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. ఉదయం నిర్వహించిన పేపర్‌ 1తోపాటు మధ్యాహ్నం…

Read More

Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..! | Warning to Vijayawada motorists.. Vehicles will be seized if caught driving on one way roads from now on

Traffic Rules: విజయవాడ నగరంలో ట్రాఫిక్ రూల్స్‌ను లైట్ తీసుకుంటున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వన్‌వే రోడ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఇక కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫైన్ వేసి వదిలేస్తున్న పోలీసులు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పుతోందని భావిస్తున్నారు. యూటర్న్ చాలా దూరం ఉంది ఎదురుగా ఎవరూ రావడం లేదు అంటూ చాలామంది డ్రైవర్లు రాంగ్‌రూట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. కానీ…

Read More